నమిత న్యూస్ - Telagana / నాగర్ కర్నూల్ : నాగార్జున సాగర్ - నవంబర్ 21 : నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని టూరిజం శాఖ తెలియచేసారు. పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి రూ. 2,000, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3,250గా టికెట్ రేట్లు ఖరారు చేశారు. పిల్లలకు(5-10) వన్ వే అయితే రూ.1,600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు. ముందుస్తూ గా తమ ప్రయాణం టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Reporter
Namitha News