నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 20 : తంబళ్లపల్లె మండలం లో జరుగుతున్న విబి జి రాంజీ పథకంలో జరుగుతున్న జలధార -జలహారతి ఉపాధి హామీ పనుల నిర్వహణపై అంబుడ్స్ మెన్ అధికారి శ్రీరాములు ప్రశంసించారు. సోమవారం ఆయన మండలంలోని జుంజురపెంట పంచాయతీ లోని ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మండలంలోని పంచాయతీలలో సైతం ఇదే స్ఫూర్తితో జలధార, జలహారతి కార్యక్రమాల నిర్వహణ తో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి జల సంరక్షణ పనులు ముమ్మరం చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపిఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు
Reporter
Namitha News