నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 25 ః రైతులు హార్టికల్చర్ మొక్కల పెంపకంలో భాగంగా కొబ్బరి మొక్కలు నాటుకోవాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. శనివారం ఆమె తంబళ్లపల్లి పంచాయతీ ఇట్నేనివారిపల్లి లో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో భాగంగా కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రైతులు హార్టికల్చర్ మొక్కల పెంపకం లో భాగంగా కొబ్బరి మొక్కలు నాటితే భవిష్యత్తులో ఆదాయం పొందవచ్చునని సూచనలు చేశారు. క్షేత్ర సహాయకులు మొక్కల పెంపకం పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లు ఎం.వి.ప్రసాద్, మారుతి కుమార్, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్ భూదేవి, క్షేత్ర సహాయకుడు రమేష్, రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News