నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - జూలై 20 : అన్నమయ్య జిల్లా సదుంలో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎర్రతివారిపల్లె మార్గంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శివశంకర్ ఈ నెల 15న ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పీలేరు కోర్టులో హాజరుపరిచారు.
Reporter
Namitha News