నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 20 ః తంబళ్లపల్లె గ్రేడ్-1 స్వర్ణ గ్రామ పంచాయతీ తాత్కాలిక కార్యాలయాన్ని ఎంపీడీవో ఉషారాణి ప్రారంభించారు. గతంలో పంచాయతీ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయంలో పైన నిర్వహిస్తుండగా వృద్ధులు, వికలాంగులు, ప్రజలకు తీవ్ర అసౌకర్యంతో పాటు ఆధార్ కార్డు నమోదు కోసం పైకి ఎక్కలేక పడుతున్న పాట్లను ఎంపీడీవో గమనించి యుద్ధ ప్రాతిపదికన పాత ఎస్టి బాలికల హాస్టల్ లో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఏర్పాటుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శి మహబూబ్ బాషా, ఏ ఈ ఓ సురేష్, టిడిపి నాయకుడు నరసింహులు, పంచాయితీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మస్తాన్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News