Monday, 27 July 2026 01:16:38 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి లో వెల్లివేరిసిన మత సామరస్యం

హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో 11 ఏళ్ల నుండి అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం హెల్పింగ్ మైండ్స్ సేవలను కొనియాడిన అయ్యప్పస్వామి భక్తులు సేవా కార్య

Date : 09 November 2025 05:31 PM Views : 184

నమిత న్యూస్ - Devotional / Annamayya : నవంబర్ 9: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదాన సేవలు,ఆకలితో ఉన్న వారి కోసం మదనపల్లి,గుర్రంకొండ ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు,అమ్మాయిల కోసం సానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు,క్యాన్సర్ భాదితులకు హెయిర్ డోనేషన్,ఆఖరి చూపు కోసం ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ బాక్స్ వంటి సేవా కార్యక్రమాలతో పలువురికి ఆదర్శంగా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ గత 11ఏళ్ల కాలం నుండి హిందు, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల మత సామరస్యం తో సోదర భావాన్ని పెంపొందిస్తూ పవిత్ర అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్పస్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం జ్ఞానోదయా హై స్కూల్ నందు అయ్యప్పస్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం మొదలు అయ్యప్ప స్వామి చిత్ర పటానికి పూజ నిర్వహించి, హారతి ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ బృందం అన్నదాన వితరణ చేశారు. హెల్పింగ్ మైండ్స్ సేవలు మరువలేనివని సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని అయ్యప్పస్వామి భక్తులు కొనియాడారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఆనవాయితీగా ప్రతి ఏటా సోదర భావం తో, మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఖాదర్ ఖాన్,సునీల్, హనీఫ్,సమీర్,కమ్మల ఆనంద్,నవీన్, సాయి దీపక్,రాహుల్,అమీన్,సైస వలి, ఉమర్, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :