నమిత న్యూస్ - Devotional / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 27 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ లో శుక్రవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, కవితమ్మల ఆధ్వర్యంలో ముగ్గురు దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం ఎమ్మెల్యే దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహా శివునికి అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే దంపతులు తొలుత వెలుగు మల్లమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అనంతరం కొండకింద మదాతం బావి వద్ద వినాయక ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో స్వామివారుల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు సదుం కు చెందిన ప్రధాన అర్చకులు రఘు, వేణు స్వాముల అర్చకత్వంలో జనవాహిని మధ్య కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు రఘు, వేణు స్వాములు హిందూ ధర్మ ఆచారాలు, ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలకు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, నవగ్రహాల పూజ, వాస్తు పూజ,జలాధివాసం,8 దాన్యాధివాసం, హోమం, యంత్ర ప్రతిష్ట అనంతరం దేవత మూర్తుల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నియమ నిష్టలతో నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప, దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు వందలాదిగా భక్తులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాలు కనులారా వీక్షించి ఆస్వాదించారు.
Reporter
Namitha News