నమిత న్యూస్ - Devotional / Annamayya : మదనపల్లె - నవంబర్ 05 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లెలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయ నూతన కార్యవర్గం కొలువుదీరింది. అధ్యక్షులు గా బండి సుబ్బరాము,కార్యదర్శిగా బొమ్మిశెట్టి నరసింహులు, కోశాధికారి గా పురం సురేంద్ర బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా గౌరవాధ్యక్షులుగా మబ్బులేటి వెంకటయ్య, గౌరవ ఉపాధ్యక్షులు గా నార్నవరం రామకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులుగా సహదేవ,రెడ్డి శేఖర్,దొండ్ల శ్రీనివాసులు,టేకులపాలెం శ్రీను,కె.రెడ్డి శేఖర్,కె.కుమార్ రెడ్డి,ఆర్.రెడ్డి ప్రసాద్,ముత్యాల సుబ్రహ్మణ్యం స్వామి,అనమల మల్లికార్జునలను ఎన్నుకున్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవచేసే భాగ్యం లభించడం ఆనందంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి నిస్వార్ధమైన సేవలు అందిస్తామని, అయ్యప్ప మాలదారులకు,భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు.అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలతో ఆలయ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని వెల్లడించారు. తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి,సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పురాణం చంద్రశేఖర్,రామిశెట్టి రత్నమయ్య,బండి పవన్ కుమార్,రామిశెట్టి నీలకంఠ,ఉప్పు రామచంద్ర,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),గుండ్లపల్లి లక్ష్మీ నారాయణ,మోడెం నాగరాజు,కౌన్సిలర్ ఎం.వి.రమణ,ఉప్పు శ్రీనివాసులు,బండి మనోజ్ కుమార్,రామిశెట్టి రెడ్డి కేశవ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News