నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 19 : నాలుగు గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడగా స్థానిక టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వీరాంజనేయులు సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన స్పందించి వెంటనే ఆ గ్రామాలలో తాగునీటి కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎఈఈ వినోద్ కుమార్ ను ఆదేశించారు. ఆదివారం తంబళ్లపల్లె పంచాయతీలోని ఇట్నేనివారి పల్లి, సాయిబాబా కాలనీ, పరసతోపు పంచాయతీ కురువపల్లి, పెండేరివారి పల్లెలకు వాటర్ ట్యాంకు ల ద్వారా తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించిన ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఈ వినోద్ కుమార్ లను టిడిపి నాయకులు, నాలుగు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News