నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 05 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ మరియు చాన్సుల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, అమరావతి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలిశారు. సమావేశంలో, డాక్టర్ విజయ భాస్కర్ చౌదరి తమ యూనివర్సిటీ లో అందిస్తున్న ఉన్నత విద్య, డిజిటల్ ఆవిష్కరణ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల రంగాలలో తమ యూనివర్సిటీ సాధించిన అంశాలు నాణ్యత విద్య, అధ్యాపకులు, మౌలిక సదుపాయాల గురుంచి ఆయన కు వివరించడం జరిగింది. మిట్స్ కళాశాల అటానమస్ స్థాయీ నుంచి యూనివర్సిటీ స్థాయికి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి ని అభినందించారు.
Admin
Namitha News