నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు అనంతపురము సోన మసూరి బియ్యం రకానికి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన తేలిపారు. అనంతపురము జిల్లాకు ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు—తక్కువ వర్షపాతం కలిగిన అధిక ఎండ ప్రాంత వాతావరణం, ఎర్రటి ఇసుక మట్టి మరియు తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల నేలలు, అధిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇక్కడ పండే సోన మసూరి బియ్యానికి ప్రత్యేకమైన నాణ్యత లక్షణాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ బియ్యం మెరుస్తున్న బంగారు-పసుపు రంగు, గట్టి గింజ నిర్మాణం, అద్భుతమైన వంట నాణ్యత మరియు మంచి వాసనతో ప్రత్యేక గుర్తింపు పొందింది అని అన్నారు. ఈ ప్రత్యేకతను రక్షించేందుకు అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ, చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి GI దరఖాస్తును MITS-IPFC సంస్థ సాంకేతిక, విధానపరమైన సహాయాన్ని అందించింది. జి.ఐ ట్యాగ్ గుర్తింపు లభించడం ద్వారా ఉత్పత్తి పేరును దుర్వినియోగం కాకుండా కాపాడటంతో పాటు రైతులకు న్యాయమైన ధరలు, మార్కెట్ నమ్మకం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య విలువ పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ రిజిస్ట్రేషన్కు దోహదపడిన అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ, అనంతపూర్, మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ వారి ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్ పి.శివయ్య మరియు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News