Monday, 27 July 2026 11:52:18 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థులకు జోహో పేరోల్ & జోహో బుక్స్ శిక్షణా కార్యక్రమం

స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మరియు చెన్నై లోని కెరీర్ స్కూల్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

Date : 07 July 2026 08:17 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 07 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగం వారు మరియు కెరీర్ స్కూల్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్, చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ విద్యార్థుల కోసం 45 రోజుల జోహో పేరోల్ మరియు జోహో బుక్స్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ కార్తీక్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని, కెరీర్ స్కూల్ హెచ్.ఆర్ సోలుషన్స్ , చెన్నై పాల్గొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని మాట్లాడుతూ నేటి కార్పొరేట్ ప్రపంచంలో డిజిటల్ బిజినెస్ అప్లికేషన్లపై ప్రావీణ్యం అత్యంత అవసరమని, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, అకౌంటింగ్, పేరోల్ అడ్మినిస్ట్రేషన్, స్మాల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే ఆధునిక ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. ఈ 45 రోజుల శిక్షణలో విద్యార్థులకు జోహో పేరోల్, జోహో బుక్స్ సాఫ్ట్‌వేర్‌లపై ప్రత్యక్ష (హ్యాండ్స్-ఆన్) శిక్షణ, ఉద్యోగుల డేటాబేస్ నిర్వహణ, పేరోల్ ప్రాసెసింగ్, చట్టబద్ధమైన పేరోల్ అనుసరణలు, హాజరు మరియు సెలవుల నిర్వహణ, వేతనాల గణన, బుక్‌కీపింగ్, జీఎస్‌టీఇన్వాయిసింగ్, బ్యాంక్ రీకన్సిలియేషన్, ఆర్థిక నివేదికల తయారీ, క్లౌడ్ ఆధారిత అకౌంటింగ్ విధానాలు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డాక్టర్. భాను శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పరిశ్రమకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు, వాస్తవ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని హెచ్‌ఆర్, ఫైనాన్స్, అకౌంటింగ్, బిజినెస్ ఆపరేషన్స్ రంగాల్లో ఇంటర్న్‌షిప్‌లు మరియు ఉద్యోగ అవకాశాలను మరింత విస్తరించుకోగలరని తెలిపారు. పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులను ఆధునిక కార్పొరేట్ రంగ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డాక్టర్. భాను శ్రీ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు , అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: