Sunday, 26 July 2026 11:47:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తిరుమలలో కల్తీ నెయ్యికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి డిమాండ్

Date : 15 November 2025 11:08 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: హిందువులకు ఎంతో ముఖ్యమైన,పవిత్రమైన తిరుమలలో కల్తీ నెయ్యికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లి పట్టణంలోని, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో కల్తీ నెయ్యి విషయమై మాట్లాడారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నారు. ఇంతటి పవిత్రమైన ఆలయంలో భక్తులు తినే లడ్డులో గత వైసిపి ప్రభుత్వం కల్తీ నెయ్యి సరఫరా చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.రూ. 150 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందులో ప్రమేయమున్న ఏ ఒక్కరిని వదలకూడదు అని, అరెస్టు చేసి జైలుకు పంపాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను కాపాడుతున్నారని, భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో భక్తులకు పెట్టే భోజనాలు, లడ్డు, పరిశుభ్రత అద్భుతంగా ఉన్నాయని గణి కొనియాడారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :