నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : తంబళ్లపల్లె మండలం లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కోర్టులో మెజిస్ట్రేట్ ఉమర్ ఫరూక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులు,పోలీస్ స్టేషన్లో ఎస్సై అనిల్ కుమార్, ఎమ్మార్సీలో ఎంఈఓ త్యాగరాజు, ట్రాన్స్కో ఏ ఈ సురేంద్ర నాలుగు సబ్ స్టేషన్ లో రిపబ్లిక్ల జెండా ఆవిష్కరించారు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, సిహెచ్ శ్రీ లో మెడికల్ ఆఫీసర్ తేజస్వి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్,సచివాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు, పలు కార్యాలయాలు, విద్యాసంస్థలలో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఎంఈఓ త్యాగరాజు, సి సి కత్తి నరసింహులు, ఎఈఓ సురేష్, ఎంపీటీసీలు సరోజమ్మ, కరీం, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామ లక్ష్మమ్మ, టిడిపి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News