నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 01 : గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించబడిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 01 నుండి 31 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం రహదారులపై ప్రమాదాలను నివారించడం అన్నారు. జిల్లా ప్రజలందరూ రహదారుల భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్, యం.వి. ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News