నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 11 : రామసముద్రం మండలంలోని ఆర్ నడింపల్లె గ్రామ పంచాయతీ బల్ల సముద్రం గ్రామ సమీపం లో వాళీశ్వరస్వామి కొండపై వెలిసిన యున్న వాళీశ్వర స్వామికి కార్తీక మాసం సందర్బంగా ఆర్ నడింపల్లె గ్రామ స్థులు స్వామి వారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి లోకానాథ్ స్వామి దీక్షితులు ఆధ్వర్యంలో పూజారి వేద మంత్రాలతో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన బాగ్యం కల్పించి భక్తులను వేదమంత్రాలు ఆశీర్వాదములతో దీవించి తీర్థప్రసాదాలు అందజేశారు.స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ జి. శివకుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి, సి హెచ్ మంజు నాథ్ రెడ్డి, మంజునాథ్, నాగిరెడ్డి, జి. శ్రీనివాసులు రెడ్డి, బి. నారాయణ స్వామి, గ్రామస్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News