నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 28 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పట్టణ సీఐ సుబ్బరాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. భక్తుల భద్రత, క్యూలైన్ నిర్వహణ, దర్శన సౌకర్యాలు, పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము 1.35 గంటలకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఆలయ అధికారులు సూచించిన నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.
Reporter
Namitha News