Sunday, 26 July 2026 10:40:37 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేయాలి - సీపీఐ

జనవరి 4న జరిగే భూ పోరాట సదస్సును జయప్రదం చేయండి - సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప

Date : 03 December 2025 10:51 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 03: బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేదలు తదితర భూమిలేని వ్యవసాయ కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున సాగు భూమిని పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని మొరవపల్లి ఎస్సీ కాలనీ నందు, సిపిఐ బీరంగి శాఖ సమావేశం, శాఖ కార్యదర్శ పి. నారాయణ స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టి. కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి. రఘునాథ్ లు హాజరై ప్రసంగించారు.బీరంగి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు పెద్ద పెద్ద భూస్వాముల కబంధ హస్తాలలో పెట్టుకొని అనుభవించుకుంటూ ఉన్నారని, వారి చెర నుంచి సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని అన్నారు. గ్రామంలో సొంత ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారని వారందరికీ మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి పక్కా గృహ నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని, అలాగే గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు,వికలాంగ,ఒంటరి మహిళ,డప్పు కళాకారులు తదితర పింఛన్లను పంపిణీ చేయడం లేదని,వెంటనే వీరందరికీ నూతన పింఛన్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2026 సంవత్సరం జనవరి 4వ తేదీన బీరంగి గ్రామంలో సోంపురాళ్ల మిట్ట వద్ద భూ పోరాట సదస్సు జరుగుతుందని, ఈ యొక్క సదస్సుకు సిపిఐ రాష్ట్ర పార్టీ నాయకులు,వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం రాష్ట్ర నాయకులు,జిల్లా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతున్నారని,ఈ యొక్క సదస్సులో పేదలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి.లక్ష్మన్న,జి. శంకర,ప్రసాదు,గంగన్న, వెంకటరమణ,వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, మంజుల, మమత, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: