నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 21 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ యన్.సి.సి. క్యాడెట్స్ స్థానిక హార్సిలీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందు లో బాగంగా యూనివర్సిటీలోని యెన్.సి.సి క్యాడెట్స్ ఉదయం హార్సిలీ హిల్స్ పైకి చేరుకున్నట్లు ఎన్.సి.సి లెఫ్టినెంట్ ఎన్ నవీన్ కుమార్ తెలిపారు. దేశ రక్షణ కొరకై అత్యవసర సమయాలలో ప్రతి ఒక్కరిని కాపాడుటకు వీలుగా క్యాడెట్స్ ట్రైనీ అయి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు. యూనివర్సిటీ యెన్ సి సి క్యాడెట్స్ సుమారు 100 మంది ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమం పాల్గొన్నారని ఆయన అన్నారు. విద్యార్థులకు రోప్ హ్యాండ్లింగ్, హిల్ క్లిబింగ్ మొదలైన వాటిపై శిక్షణను అందజేశామని ఉదయం 7 గంటలకు ప్రారంభించి 11 గంటలకు చేరుకున్నట్లు ఆయన అన్నారు. హిల్స్ లో క్యాడెట్స్ కు సి సెరిటిఫికేట్, బి సర్టిఫికెట్ల పై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో యెన్ సి సి సుబేదార్ మేజర్ సంజు ఖడా, పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ హవల్దార్ డి ఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినంట్ కల్నల్ పి.లోగనాథన్, 35 ఆంధ్ర బెటాలియన్, చిత్తూర్ వారికి యెన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ ఎన్.నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Namitha News