నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 02 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కాలర్ షిప్స్ విభాగం వారు యూనివర్సిటీ విద్యార్థులకు విద్య లక్ష్మి పోర్టల్ ద్వారా లభించే విద్యా రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎస్.బీ.ఐ బ్యాంకు మేనేజర్ రుస్తుమ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వం అందిస్తున్న విద్యా రుణాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్య లక్ష్మి పోర్టల్ ద్వారా రుణ దరఖాస్తు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండటంతో పాటు విద్యను నిరవధికంగా కొనసాగించేందుకు ఇది ఎంతగానో సాయపడుతుందని తెలిపారు. విద్య లక్ష్మి పోర్టల్ ద్వారా ఒక్కో విద్యార్థికి ₹7.5 లక్షల వరకు ఎలాంటి గిరవు లేకుండానే ఆధార్, పాన్ మరియు మంచి సిబిల్ స్కోర్ ఆధారంగా విద్యా రుణాలు పొందవచ్చని వివరించారు.విద్యార్థులకు ఉపయోగకరమైన సమాచారం అందించినందుకు యూనివర్సిటీ యాజమాన్యం బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగాధిపతి డాక్టర్ ఆతహర్ సమీనా ఖాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News