నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 02 : తంబళ్లపల్లె మండలంలోని వెలుగు మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఎం డి మంజూర్ ఇలాహి ప్రశంసించారు. మంగళవారం ఆయన వెలుగు కార్యాలయంలో ఏటీఎం గంగాధర్ తో కలిసి సీసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ ద్వారా మండలంలోని 36 గ్రామ సమాఖ్యలు, 18 వివోలు, 450 కి పైగా మహిళా సంఘాలకు గత ఏడాది రూ 50 కోట్లకు పైగా సిఐఎఫ్ రుణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అదేవిధంగా శ్రీనిధి, ముద్ర, పీఎం ఈజిపి, చేనేత కార్మికులకు సైతం రుణ సౌకర్యం కల్పించామని అదే విధంగా రైతులకు పంట రుణాలు, పాడి ఆవులు, గొర్రెలు, మినీ వ్యాపారాలు పలు రకాల విభిన్న వ్యాపారాలపై రుణాలు అందించామని చెప్పారు. భవిష్యత్తులో ఇదే తంతు కొనసాగించి వెలుగు సంఘ సభ్యుల సహకారంతో మరిన్ని రుణాలు అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ఇండియన్ బ్యాంక్ ఇస్తున్న సహకారం మరువరానిదని కొనియాడారు. మహా మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదికి మహిళా సంఘాల కు విభిన్న వ్యాపారాల కోసం రెండు సౌకర్యం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. వారి వెంట సీసీలు కత్తి నరసింహులు, రమణ, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మ, వేట మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News