నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 18 : రామసముద్రం మండలంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పర్యటన చేశారు. ఈ సందర్బంగా టిడిపి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ బాణా సంచాల నడుమ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం టిడిపి రాజంపేట పార్లమెంట్ కోశాధికారి గజ్జల సీతప్ప తండ్రి వెంకటరమణ పై జరిగిన దాడి సంఘటనపై పోలీస్ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబుతో మాట్లాడటం జరిగింది. దాడి చేసిన వ్యక్తులు పై ఘటన ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ బాబు వెల్లడించారు.మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ తమ కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని ఎల్లవేలలా మీకు అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, సి.నారాయణరెడ్డి, చిన్నుస్వామి, బాలాజీ, బందెల శివన్న,మాజీ సర్పంచ్ రెడ్డిశేఖర్,వేణు, శ్రీనివాసరెడ్డి, లోకనాథ్ రాజు, జైకుమార్, జావేద్,మినికి శ్రీనాథ్ రెడ్డి మహమ్మద్, చాంద్ బాషా, కృష్ణమూర్తి, మణి, ఆదెప్ప, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ శీనా,మంజు,ఎల్.శివ వెంకటరమణ, రామచంద్ర, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News