నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లి జనసేనపార్టీ కార్యాలయం లో నేడు జరిగిన పాత్రికేయులు సమావేశం LOB జనసేన నాయకులు AMC చైర్మన్ జంగాల శివరామ్ పై ఆరోపణలు ఖండించిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరుజిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా మాట్లాడుతూ గత రెండు రోజులుగా జరిగిన బిఎస్పి పార్టీ నాయకుల మీడియా సమావేశంలో మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారి పైన నిరాధర ఆరోపణలు, అసత్యమని జంగాల శివరాం గారు టమేటా మార్కెట్ యార్డులో బెదిరింపు చర్యలకు పాల్పడినారని అంతే కాకుండా డబ్బులు వసూలు చేశారని AMC చైర్మన్ పదవిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారన్న బీఎస్పీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు.బిఎస్పి నాయకులు ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడాలన్నారు. AMC డైరెక్టర్ లక్ష్మీపతి మాట్లాడుతూ టమాటో మార్కెట్లో కాంట్రాక్టులను టెండర్ ద్వారా పిలుస్తారని ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతోందని అందులో ఎవరైనా పాల్గొనవచ్చని తద్వారా టెండర్ ఎవరికి దక్కితే వారికే సొంతమని చెప్పారు. అలాగే టౌన్ సెక్రటరీ నాగమణి తదితరులు వారి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
టౌన్ సెక్రటరీ నాగమణి మాట్లాడుతూ AMC చైర్మన్ గారు డబ్బులు ఇచ్చి చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారని ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చారని మీరు నిరూపించాలని, బందేల గౌతమ్ గారు కూడా మాయావతి గారికి ఎంత ఇచ్చి రాష్ట్ర పదవి తీసుకున్నారని అన్నారు.వీర మహిళ టౌన్ సెక్రటరీ పద్మావతి మాట్లాడుతూ వైసిపి హయాంలో చాలా అవినీతి, భూ కబ్జాలు, దౌర్జన్యాలు బెదిరింపు చర్యలు జరిగాయని వాటి గురించి ఎపుడు ప్రస్తావించలేదని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మీరు అంతా ఎక్కడున్నారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సనా ఉల్లా, AMC డైరెక్టర్ లక్ష్మీపతి,టౌన్ సెక్రెటరీ నాగవేణి ,టౌన్ సెక్రటరీ పద్మావతి,టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్ ,టౌన్ ఉపాధ్యక్షులు కొలిమి ప్రసాద్ టౌన్ సెక్రెటరీ జనార్ధన్,శిన, రమణ ఆనంద్,పవన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News