నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 ః ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ద్వారా వెయ్యి, శ్రీనిధి పాల డైరీ లబ్ధిదారులకు వెయ్యి మొత్తం 2వేల పాడి ఆవుల రుణాలు మంజూరు కు శ్రీకారం చుడుతున్నట్లు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సుమలత తెలిపారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో మహిళ సంఘాలు, సంఘమిత్రలు, మహిళా సమాఖ్య సభ్యులతో సమీక్షించారు. తంబళ్లపల్లె, కోసువారిపల్లి ఇండియన్ బ్యాంక్ ల ద్వారా రికార్డ్ స్థాయిలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, పంట రుణాలు పంపిణీ జరిగినట్లు చెప్పారు. దీంతోపాటు గృహాలు, వెహికల్, ప్లాట్లు,తనఖా మార్ట్ గేజ్ తో రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. పీఎం స్వనిధి, పి ఎం జి ఎస్ వై, పీఎం ఈజిపి, పీఎం విశ్వకర్మ, ముద్ర హ్యాండ్లూమ్స్ రుణాల పంపిణీ, పీఎం డిడి కేవై, పీఎం సూర్యగర్ మ మఫ్ట్ బిజిలి యోజన, పై చొరవ చూపిస్తున్నట్టు చెప్పారు. బ్యాంకులకు సంబంధించిన రుణాల రికవరీ, సంఘాల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. బ్యాంకులకు సంబంధించి సైబర్ నేరాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎస్ ఎస్ జి రుణాల పంపిణీలో తంబళ్లపల్లె ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఏపిఎం గంగాధర్, సీసీలు, సంఘ మిత్రలు, వివో లీడర్లల పనితీరుపై జోనల్ మేనేజర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఏపీఎంను దృశ్యాలువతో బ్యాంక్ రీజినల్ మేనేజర్, మేనేజర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రఘునాథ, మేనేజర్లు,ప్రవీణ్ కుమార్, నాగరాజు, ఏపీఎం గంగాధర్, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామ లక్ష్మమ్మ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మహిళా సంఘాలు, సంఘమిత్రలు, వివో సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News