నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 03 : మదనపల్లి మండలం సి.టి.యం. పంచాయతీ పరిధి లోని నేతాజీ కాలనీ, కొండామారిపల్లి పంచాయతీ లోని వెంకప్ప కోట నందు నూతనంగా మంజూరైన సీ.సీ. రోడ్డు కు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాష. కొంత కాలం లోనే చాలా గ్రామాల్లో ఇప్పటికే సి.సి. రోడ్లు, కచ్చా రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాం, గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేసిన పాపాన పోలేదు. గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ మౌలిక వసతుల కల్పన లో ప్రభుత్వం ముందుంటూ అభివృద్ధి లో చేస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. అనారోగ్య సమస్యలతో ఆర్థిక సాయం కొరకు వినతి మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ మంజూరైన పైకం ను లబ్దిదారులైన రమాదేవి , చెన్నకృష్ణ,నీరజ ,అలీ ఖాన్ ,విజయ కుమారి, ఖాదర్ బి బాధితులకు 38 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్సార్ షంషేర్ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి పలహేకరి సంఘం నాయకులు రాగినేని రఘుపతి నాయుడు పంచాయతీ నాయకులు ప్రభాకర్ రెడ్డి జిలానీ , షామీర్, చలపతి, మరియు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News