నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డి పల్లి - జనవరి18 : ఎన్టీఆర్ గారి 30 వ వర్ధంతి సందర్భంగా లక్కిరెడ్డి పల్లె మూడు రోడ్ల కూడలి నందు లక్కిరెడ్డి పల్లె టిడిపి నాయకుల ఆధ్వర్యం లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అటవి శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ యర్ర గొల్ల రెడ్డెయ్య యాదవ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ పోలిరెడ్డి సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ షఫీ నాయక్, బీసీ నాయకులు విజయభాస్కర్, ఈ సందర్భంగా రెడ్డెయ్య యాదవ్,పోలిరెడ్డి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ...సినిమాల్లో నటుడుగా నే కాదు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవముగా, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు,NTR పౌరాణిక పాత్రల ద్వారా తెరపై దైవత్వానికి రూపం ఇచ్చిన ఆయన, రాజకీయాల్లోకి అడుగు పెట్టి తెలుగు జాతికి బలమైన గొంతుకగా నిలిచారు. నటుడిగా, నాయకుడిగా కూడా ప్రజల హృదయాల్లోప్రపంచస్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల రొట్టెలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షఫీ నాయక్, మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఆరిఫ్, హాస్పిటల్ కమిటీ సభ్యులు వెంకట్రామ రాజు, భాస్కర్ రెడ్డి, నీటి సంఘం చైర్మన్ గొర్ల మోహన్ రెడ్డి,గోర ,పటాన్, గంగయ్య, సాదుల్లా , రమణ,దండే శ్రీనివాసులు,చిర్ల సుధాకర్ యాదవ్,మాజీ ఎంపిటిసి రాజేంద్ర రెడ్డి,ధర్మరాజు,ధర్మ రెడ్డి , గురుమూర్తి,సుబ్బరాజు, అశోక్,రామకృష్ణ,రామయ్య, జొన్న శ్రీనివాసులు,అహ్మద్ అలీ ,మహేష్, కుళ్ళాయప్ప ,బాబు,శివ మల్లి నాయుడు, మల్లి నాయుడు,రవీంద్ర నాయుడు, నసరుద్దీన్,చలపతి నాయుడు,చంద్రశేఖర్ నాయుడు, చలపతి నాయుడు,కృష్ణ,శోభ శ్రీను,ఆంజనేయులు, రామాంజినేయులు, మధు,అన్వర్, సునీల్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు
Reporter
Namitha News