నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 : రైతులు ఐడి నమోదు తో భవిష్యత్తులో వ్యవసాయ భద్రత తో పాటు సంక్షేమ పథకాల కు జీవనాడిగా నిలుస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి రమణ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు ఐడి రైతే స్వయంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ నెంబర్తో నమోదు లేదా సమీప రైతు సేవా కేంద్రం ద్వారా చేసుకోవచ్చన్నారు. ఐడి నమోదుకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ అవసరమన్నారు. ఐడి నమోదు తో పీఎం కిసాన్ ఆర్థిక సాయం తో పాటు పంటల బీమా ఇతర వ్యవసాయ పథకాలకు దోహదపడుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు సేవ కేంద్రం ద్వారా 11 నెంబర్ల గల ఐడి నెంబర్ పొందాలన్నారు. ఆయన వెంట గ్రామా వ్యవసాయ అధికారులు సురేష్, రెడ్డి శేఖర్ తదితరులు ఉన్నారు.
Reporter
Namitha News