నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి ః తంబళ్లపల్లి మండలంలో వి.బి.జీ రాంజీ పథకంలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని ఉపాధి హామీ సిబ్బంది పి డ్వామా ఎపీడీ నందకుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన ఉపాధి హామీ పనులపై రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి నుండి ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు, ట్రెంచీలు, ఇండ్ల వద్ద వాటర్ హార్వెస్టింగ్, నీటి నిలువ పనులు చేపట్టాలని సూచించారు. మండలంలోని మారుమూల గ్రామాలలో మట్టి రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని దీంతోపాటు నీతో పాటు అక్కమ్మచెరువు సుందరీ కరణ పనులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. నేటి ప్రభుత్వం 125 రోజులు పని దినాలు పెంపు, వారం రోజుల కే బిల్లుల చెల్లింపు, పాత బకాయిలు చెల్లింపు చేపట్టిన విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి పనులు ఊపందుకునేలా ఉపాధి హామీ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ సమీక్షలో ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు సుజాత, పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవిలు పాల్గొన్నారు
Reporter
Namitha News