నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - నవంబర్ 14 : తంబళ్లపల్లి మండలంలోని గిరిజన తండాలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి ఆధ్వర్యంలో కోటకొండ ఎగువ సుగాలి తండా, దిగువ తాండ, నాయనవారిపల్లె, ఏటిగడ్డ పల్లి, కోటకొండ కస్పా, కృష్ణాపురం గ్రామాలలో నేటి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహనతో పాటు కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా చేపట్టారు. అదేవిధంగా గత వైకాపా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శంకర్ నాయక్, తాళ్ల చంద్రశేఖర్, మాజీ సింగల్ విండో డైరెక్టర్ నరేందర్ రెడ్డి,వాటర్షెడ్ చైర్మన్ మల్లికార్జున, ఎంపీటీసీ పద్మనాభ రెడ్డి, సీనియర్ నాయకుడు మల్లికార్జున, శ్రీనివాసులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News