నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 06 : తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ 20 23 లో పోలీసులకు పట్టుబడిన 11 మంది పేకాట రాయుళ్లుకు తంబళ్లపల్లి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ గురువారం 7 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి తంబళ్లపల్లె ఎస్సై ఉమా మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు తంబళ్లపల్లి మండల పరిధిలో పలువురు పేకాట ఆడుతూ 2023వ సంవత్సరం పట్టుబడుగా వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అప్పటి ఎస్సై అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి గురువారం నిందితులపై నేరం రుజువు కావడంతో 11 మంది ముద్దాయిలు కు 7 రోజులు జైలు శిక్షతోపాటు రూ 300 జరిమానా విధించినట్లు తీర్పు చెప్పారు. జరిమానా కట్టని పక్షంలో మరో 30 రోజులు సాధారణ జైలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.
Reporter
Namitha News