నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఫిబ్రవరి 27 : ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నేటి నుంచి మూడు రోజులు పాటు కార్పెంటర్స్ (వడ్రంగి వృత్తి) కు వారి పనిలో నైపుణ్యం మరియు శిక్షణ తరగతులు ప్రారంభించారు..ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆత్మకూరు ఆర్డీవో బి.పావని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ కార్యక్రమం గురించి ఆత్మకూరు ఆర్డీవో బి పావని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వడ్రంగి వృత్తి పనివారికి వారి పనిలో అధు నూతన నైపుణ్యం పొందేందుకు ఉపయోగపడుతుందని మూడు రోజులు పాటు జరిగే శిక్షణ తరగతులలో కొయ్య పనిపై శిక్షణ అందించి చివరి రోజు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రమాద భీమా చేసి సర్టిఫికెట్లను అందిస్తారు..అలాగే వృత్తి పనులు వీరికి సహాయపడే విధంగా పనిముట్లతో కూడిన ప్రత్యేక కిట్టును ఉచితంగా అందిస్తున్నట్లు ఇటువంటి శిక్షణ గ్రామీణ ప్రాంత వడ్రంగి వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.. వడ్రంగి పనిలో వృత్తి నైపుణ్యం సాధించిన వారికి విశ్వకర్మ పథకం ద్వారా వీరికి రుణాలు అందిస్తామని తెలిపారు..ఆత్మకూరు కు చెందిన శ్రడ్, నెల్లూరుకు చెందిన నవజీవన ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల ఎన్జీవోలు వాగాల శ్రీహరి, కె. విక్టోరియా లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మహమ్మద్ మున్వర్, పట్టణ ఎస్సై జిలాని, స్థానిక టిడిపి నేత చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నియోజకవర్గం నుండి 55 మంది కొయ్య వృత్తి పనివారు పాల్గొన్నారు
Admin
Namitha News