Sunday, 26 July 2026 11:35:53 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మహిళ ఆరోగ్యమే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష - డి.ఆర్.డి.ఏ. పి.డి నాగేశ్వరావు

Date : 20 February 2026 10:50 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబానికి ఆమె శ్రీరామరక్షగా నిలుస్తుందని డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు హితబోధ చేశారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో రైతు సాధికారిక సంస్థ ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, అమలు సామర్ధ్య పెంపుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణతో పాటు ప్రకృతి వ్యవసాయం, జీవన ఎరువులు, కషాయాలతో పండిన పంటలు ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. మహిళా సంఘాలు ఫుడ్ బాస్కెట్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో పెరటి తోటలు పెంపకం అలవర్చుకోవాలన్నారు. నేటి మానవ సమాజానికి ప్రకృతి వ్యవసాయ పంటలే ఆరోగ్యకరమని ప్రతి ఒక్కరు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఫుడ్ బాస్కెట్, కార్యాచరణ, అమలు, సామర్ధ్య పెంపుపై రైతు సాధికారిక సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సునీత, మండల కోఆర్డినేటర్ రుక్మిణి లు మహిళా సంఘ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘమిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: