నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 ః ఉపాధి హామీ జనధార-జల హారతి పనుల లో భాగంగా చేపట్టిన సప్లై ఛానల్ పనులతో ప్రతి చెరువుకు సాగునీరు అందాలని తంబళ్లపల్లె స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ మొరుసుపల్లి బురుజు లో జరిగిన ఉపాధి హామీ సప్లై ఛానల్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి చెరువుతో బాటు కుంటలు, సాగునీటి వనరుల కు సంబంధించిన సప్లై ఛానల్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల 125 రోజుల పని రోజుల పెంపు, కూలీల హాజరు అందుతున్న వేతనాలు పై ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలని సూచించారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లింపు జరగాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ సతీష్ , రెడ్డప్ప,ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రాణి, అశోక్, రమేష్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు
Reporter
Namitha News