Sunday, 26 July 2026 05:31:52 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

నేషనల్ లెవెల్ అడ్వెంచర్ & మౌంటెనీరింగ్ క్యాంప్‌ లో పాల్గొన్న మిట్స్ యూనివర్సిటీ యన్.సి.సి. క్యాడెట్

Date : 25 December 2025 07:26 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, యన్.సి.సి క్యాడెట్ ఆర్.లాస్య ప్రియ, ఉత్తరాఖండ్‌లోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ మౌంటెనీరింగ్ శిక్షణా కేంద్రం నిర్వహించిన నేషనల్ లెవెల్ అడ్వెంచర్ మరియు మౌంటెనీరింగ్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఈ శిక్షణలో దేశ నలుమూలల నుండి 400 మందికి పైగా క్యాడెట్స్ పాల్గొనగా, అందులో మిట్స్ విద్యార్థిని పాల్గొనడం గర్వకారణం అని అన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో యెన్.సి.సి క్యాడెట్లకు పర్వతారోహణ,రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్ వంటి కఠిన శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రకృతి సవాళ్ళను ఎదుర్కుంటూ జట్టు భావనతో పని చేయడం, దేశ సేవకు సిద్దమవడం వంటి విలువలు పెంపొందుతాయని అన్నారు. ప్రతి క్యాడెట్ కూడా తమ వంతు దేశ రక్షణకు పాటుపడాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరము యెన్.సి.సి క్యాడెట్స్ తమ యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నారని, ఇది ఇలాగె కొనసాగాలని ప్రతి క్యాడెట్ ప్రతి క్యాంపు కు వెళ్లాలని ఆయన అన్నారు.శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన క్యాడెట్ లాస్య ప్రియ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్. యెన్.వి, అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ మరియు తిరుపతి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యేంద్ర దయా తదితరులు అభినందనలు తెలియజేసారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :