నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, యన్.సి.సి క్యాడెట్ ఆర్.లాస్య ప్రియ, ఉత్తరాఖండ్లోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ మౌంటెనీరింగ్ శిక్షణా కేంద్రం నిర్వహించిన నేషనల్ లెవెల్ అడ్వెంచర్ మరియు మౌంటెనీరింగ్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేసిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఈ శిక్షణలో దేశ నలుమూలల నుండి 400 మందికి పైగా క్యాడెట్స్ పాల్గొనగా, అందులో మిట్స్ విద్యార్థిని పాల్గొనడం గర్వకారణం అని అన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో యెన్.సి.సి క్యాడెట్లకు పర్వతారోహణ,రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్ వంటి కఠిన శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రకృతి సవాళ్ళను ఎదుర్కుంటూ జట్టు భావనతో పని చేయడం, దేశ సేవకు సిద్దమవడం వంటి విలువలు పెంపొందుతాయని అన్నారు. ప్రతి క్యాడెట్ కూడా తమ వంతు దేశ రక్షణకు పాటుపడాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరము యెన్.సి.సి క్యాడెట్స్ తమ యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నారని, ఇది ఇలాగె కొనసాగాలని ప్రతి క్యాడెట్ ప్రతి క్యాంపు కు వెళ్లాలని ఆయన అన్నారు.శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన క్యాడెట్ లాస్య ప్రియ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్. యెన్.వి, అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ మరియు తిరుపతి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యేంద్ర దయా తదితరులు అభినందనలు తెలియజేసారు.
Reporter
Namitha News