Sunday, 26 July 2026 05:15:06 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీ

ఆరు పంచాయతీలు క్లీన్ చిట్ - రికవరీ లో గంగిరెడ్డిపల్లి టాప్

Date : 07 January 2026 10:43 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : తంబళ్లపల్లె మండలంలో జరిగిన ఉపాధి హామీ పై జరిగిన సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీకి జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఉపాధి హామీ పనుల పై బహిరంగ విచారణ సభ జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 21 పంచాయతీలకు సంబంధించి జరిగిన ఉపాధి పనులపై పంచాయతీల వారీగా విచారణ జరిపారు. మండలంలో అత్యధికంగా గంగిరెడ్డిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ బిల్లులు ఉద్యోగులకు చేసి నిధులు దుర్వినియోగం జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ఇందుకు సంబంధించి రూ41,834, వెయ్యి అపరాధ రుసుము పీ.డీ రికవరీకి ఆదేశించారు. పలు పంచాయతీలలో ఉపాధి హామీలో నాటిన మొక్కలు చనిపోవడంతో పీ డీ మందలించి వెంటనే మొక్కలు నాటించాలని ఆదేశించారు. ఉపాధి అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసి సర్వర్ క్యాప్సల్ చేయాలని సూచించారు. పలు ఉపాధి పనులకు సంబంధించి రికవరీలతో బాటు అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించారు. కాగా మండలంలో ఆర్ఎన్ తాండ, కొటాల, కన్నె మడుగు, మర్రిమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి, కోటకొండ, పంచాయతీలలో ఉపాధి హామీ పనులు నిర్వహణ, బిల్లుల చెల్లింపు, మొక్కల పెంపకం తదితర అంశాలపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం పై వారిని అభినందించారు. భవిష్యత్తులో వీబిజి రాంజీ ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి ద్వారా నూతన ఒరవడి సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి, అంబుడ్స్ మెన్ శ్రీరాములు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,ఎస్ ఆర్ పి సూర్య చక్ర, తిరుమలేష్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ రమణ, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, ఆయేషా,టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, రామాంజులు, ఈసీలు మహేష్, రామన్న, టి ఏ లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: