నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఫరవానియా నగరంలో ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు - సుగవాసి యువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు మదనపల్లె : కువైట్ (గల్ఫ్) దేశం ఫరవానియా నగరంలో నౌషాద్ హోటల్ నందు ఆదివారం బడుగు,బలహీన,ముస్లిం,మైనార్టీ వర్గాల ఆశజ్యోతి,పేదల పెన్నిధి,నిరంతర ఆశయసాధకుడు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం,కందల వాండ్లపల్లి నివాసి సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (ఎన్ఆర్ఐ టీడీపీ) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి కువైట్ టీడీపీ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు,టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదురున్,గల్ఫ్ జనసేన కన్వీనర్ కంచన శ్రీకాంత్,గల్ఫ్ జనసేన కో-కన్వీనర్ పగడాల అంజనకుమార్,టిడిపి పాలఏకరి కువైట్ అధ్యక్షులు కొండమర్రి శ్రీహరి నాయుడు,బాల రాయల్,ప్రేమ్ రాయల్,కొల్లి ఆంజనేయులు నాయుడు,రమేష్ యాదవ్,డాన్స్ మాస్టర్ వేణు,పెద్ద బలిజ పల్లి సేవా సంఘం అధ్యక్షుడు రాజా,పరమేష్,జిలాన్ బాషా,పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు నరసింహ,ఆవుల నాగరాజు,వెంకీ చౌదరి,జలీల్ భాయ్,గురుమూర్తి నాయుడు,వేణుగోపాల్ రాజు,మహబూబ్ బాష్,నారాయణమ్మ,దేవి,మంజు మరియు టీడీపీ,జనసేన నాయకులు వీరమహిళలు చిన్నపిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభిమానించే మృదుస్వభావి స్నేహశీలి సేవా గుణం కలిగిన నేత అందర్నీ ఆప్యాయంగా పలకరించె తమ అభిమాన నాయకుడు అయిన సుగవాసి ప్రసాద్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం టీడీపీ జనసేన నాయకులు పిల్లల సమక్షంలో భారీ కేకు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తదనంతరం అతిథులకు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
Reporter
Namitha News