నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న టిటిడి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం వెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ధూప దీప నైవేద్యాలతో పలు రకాల పుష్పాలతో అలంకరించి స్వామివారిని ఉదయం కల్పవృక్ష వాహనం సాయంత్రం హనుమ వాహనంపై ఆలయ మాడవీధులు తోబాటు కోసువారిపల్లె పురవీధుల్లో మంగళ వాయిద్యాలు, గోవింద నామ స్మరణం, పలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో టిటిడి అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి అర్చకుల బృందం, టిటిడి అధికారులు కృష్ణమూర్తి, నగేష్, మురళి వందలాదిమంది స్వామి భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు
Reporter
Namitha News