నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె ఉషారాణి నియమితులైనట్లు చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల డిప్యూటీ ఎంపీడీవో కె ఉషారాణి పదోన్నతిపై తంబళ్లపల్లె ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం తంబళ్లపల్లె ఎంపీడీవో గా పని చేసిన బాపూజీ పట్నాయక్ ఈ మధ్యకాలంలో పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ ఎంపీడీవో ఎం.వి ప్రసాద్ ఇంచార్జి ఎంపీడీవో గా కొనసాగుతున్నారు. తంబళ్లపల్లె మండలంలో నూతన ఎంపీడీవో కు పలు సమస్యలు సవాలుగా నిలువ నున్నాయి. ఎంపీడీవో గా ఉషారాణి నియామకంపై ఇంచార్జ్ ఎంపీడీవో ఎంవి ప్రసాద్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప,ఎఈలు ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్,పిఆర్ రమణ, హౌసింగ్ సుజాత, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బిజెపి అధ్యక్షుడు రమణ, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు
Reporter
Namitha News