నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటి పడావో-భేటీ బచావో స్ఫూర్తితో తంబళ్లపల్లె మండలం లోని టెన్త్ బాలికలు ఈఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని ఎంఈఓ త్యాగరాజు కొనియాడారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో భేటీ పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికల కు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ బాలికలు కిశోర వికాసం కార్యక్రమంలో భాగస్వాములై వేసవి సెలవు రోజుల్లో జీవన నైపుణ్యాలు, ఆరోగ్యమేళా, చట్టాలపై అవగాహన పొందాలని సూచించారు. ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు బాలికలు ఫోక్సో చట్టం, పి సి ఎం ఎ చట్టం, డివి మరియు ఆర్టీఈ చట్టం పై అవగాహన పొందాలన్నారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు బాలికలు బాల్యవివాహాల నిరోధం, బాలికల భద్రత విద్యా ప్రోత్సాహం మరియు గ్రామస్థాయి నిర్ణయాలు, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం, హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన, శారీరిక వ్యాయామం, స్మార్ట్ ఫోన్ల వినియోగం, సైబర్ భద్రత, ఆన్లైన్ భద్రత, టోల్ ఫ్రీ నెంబర్లు గురించి వివరించారు. అనంతరం సిడిపిఓ సుజాత బాల్య వివాహాల నిర్మూలనపై కిశోర బాలికలకు పలు సూచనలు సలహాలు చేశారు. బాలవివాహాలు నిర్వహిస్తామని కిశోర బాలికలతో పాటు తల్లిదండ్రులు, అధికారుల చేత ప్రమాణం చేయించారు. చివరిగా టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు చెందిన 25 మంది బాలికలకు డాక్యుమెంట్ ఫైల్స్ అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమణమ్మ, భారతి, చంద్రకాంత, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
Reporter
Namitha News