Monday, 27 July 2026 09:54:57 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భేటీ పడావో స్ఫూర్తితో టెన్త్ లో బాలికల ఉత్తమ ఫలితాలు - ఎంఈఓ త్యాగరాజు

Date : 11 May 2026 11:08 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటి పడావో-భేటీ బచావో స్ఫూర్తితో తంబళ్లపల్లె మండలం లోని టెన్త్ బాలికలు ఈఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని ఎంఈఓ త్యాగరాజు కొనియాడారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో భేటీ పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికల కు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ బాలికలు కిశోర వికాసం కార్యక్రమంలో భాగస్వాములై వేసవి సెలవు రోజుల్లో జీవన నైపుణ్యాలు, ఆరోగ్యమేళా, చట్టాలపై అవగాహన పొందాలని సూచించారు. ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు బాలికలు ఫోక్సో చట్టం, పి సి ఎం ఎ చట్టం, డివి మరియు ఆర్టీఈ చట్టం పై అవగాహన పొందాలన్నారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు బాలికలు బాల్యవివాహాల నిరోధం, బాలికల భద్రత విద్యా ప్రోత్సాహం మరియు గ్రామస్థాయి నిర్ణయాలు, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం, హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన, శారీరిక వ్యాయామం, స్మార్ట్ ఫోన్ల వినియోగం, సైబర్ భద్రత, ఆన్లైన్ భద్రత, టోల్ ఫ్రీ నెంబర్లు గురించి వివరించారు. అనంతరం సిడిపిఓ సుజాత బాల్య వివాహాల నిర్మూలనపై కిశోర బాలికలకు పలు సూచనలు సలహాలు చేశారు. బాలవివాహాలు నిర్వహిస్తామని కిశోర బాలికలతో పాటు తల్లిదండ్రులు, అధికారుల చేత ప్రమాణం చేయించారు. చివరిగా టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు చెందిన 25 మంది బాలికలకు డాక్యుమెంట్ ఫైల్స్ అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమణమ్మ, భారతి, చంద్రకాంత, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: