నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 : దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం వైకాపా నాయకులదేనని జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డులో 58లక్షల లీటర్ల పామాయిల్, రెండు లక్షల లీటర్ల సింథటిక్ కెమికల్ (జంతువుల కొవ్వు) కలిపారని ఇక నెయ్యి లేదని తెలిపారు.1-16- 2024 లో ఒకసారి 23-7-2024లో మరోసారి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ 35 వపేజీలో లడ్డు ప్రసాదంలోజంతువుల కొవ్వు కలిసినట్లు ఉందన్నారు. లడ్డు ప్రసాదంలో చేసిన రిపోర్టులన్నీ సింథటిక్ కెమికల్స్ వాడినట్లు వచ్చాయని నేడు వైకాపా నాయకులు చేసిన పనికి సిగ్గుపడక ఆ నింద జనసేన, టిడిపి , బిజెపి నాయకుల పై మోపి శ్రీరంగనీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైకాపా నాయకులకు పుట్టగతులు ఉండవని హిందూ భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం అపవిత్రం చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన వైకాపా నాయకులు పార్టీ కావాలో శ్రీవారు కావాలో తేల్చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని దెబ్బతీయాలనే వైకాపా కపట నాటకాలు చెల్లవని హిందువుల మనోభావాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో వైకాపా కనుమరుగు కావడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె జనసేన నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో చేసిన కల్తీని వైకాపా నాయకులు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్, కూటమి పై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఉమేష్, రఘు, సురేష్, అరవింద్, రెడ్డప్ప, కార్తీక్, రెడ్డి ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News