Sunday, 26 July 2026 01:12:27 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు

Date : 26 April 2026 10:27 PM Views : 388

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుభకార్యం లేదా ఆ శుభకార్యం ఏదైనా కులం, మతం, ప్రాంతం బేదం లేకుండా తనకు తెలిసిన వెంటనే స్పందించడం తనకు చేతనైన సాయం చేసి ఆదుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇందులో భాగంగా ఆదివారం నడిరోడ్డులో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి గాయపడి బాధలో ఉన్న అతన్ని తన సొంత వాహనంలో హుటాహుటిన మదనపల్లి ఆస్పత్రికి తరలించి తన మానవత్వాన్ని మరో మారు చాటుకుని శభాష్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదివారం కుప్పం నియోజకవర్గంలో ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో తంబళ్లపల్లెలోని తన స్వగృహానికి తన వాహనంలో బయలుదేరాడు. మదనపల్లి-తంబళ్లపల్లె ప్రధాన రహదారి జోగివానిబురుజు సమీపంలో వస్తుండగా అదే సమయంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగి ద్విచక్ర వాహనంలో వస్తున్న తంబళ్లపల్లెకు చెందిన మహబూబ్ పీర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనం కోసం ఎదురుచూస్తున్న సంఘటన చూసి చెలించి పోయిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హుటాహుటిన వాహనం ఆపి బాధితున్ని పరామర్శించి ధైర్యం చెప్పి తన వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సలు దగ్గరుండి చేయించాలని మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, నాయకులను పురమాయించి ప్రమాద విషయం బాధితులు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు.అనంతరం వేరే వాహనంలో ఎమ్మెల్యే తంబళ్లపల్లె స్వగృహానికి బయలుదేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రమాద స్థలంలో ఆయన పడిన ఆందోళన, చూపిన చొరవ చూసి స్థానిక ప్రజలు ఔరా మన ఎమ్మెల్యే మనసున్న మారాజని కొనియాడడం కొసమెరుపు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :