నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 20 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ (IRC) మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (IETE) విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో “కెరీర్ గైడెన్స్” పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలో హెడ్ ఆఫ్ హెచ్ఆర్ & అడ్మిన్గా పనిచేస్తున్న మనీష్ మజుందార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. తన పరిశ్రమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ, టెక్నికల్ నాలెడ్జ్, లీడర్షిప్ లక్షణాలు, టీమ్వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, రిజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు మరియు నిరంతర అభ్యాసం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆటోమేషన్ మరియు డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో భవిష్యత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, వర్క్షాప్స్ మరియు సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమలలో జరిగే నియామక విధానాలు, ఆప్టిట్యూడ్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూలలో విజయవంతం కావడానికి అవసరమైన అంశాలపై అవగాహనా కలిపించారు. కార్యక్రమం చివర్లో నిర్వహించిన ప్రశ్నోత్తర సమావేశంలో విద్యార్థులు కెరీర్ ప్లానింగ్, ఉన్నత విద్య, ప్లేస్మెంట్స్ మరియు పరిశ్రమల అంచనాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గోరె, డాక్టర్ వి జయప్రకాశన్, అసిస్టెంట్ డీన్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News