నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు పాల్గొన్న విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు. ఎస్పీ ధీరజ్ గారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం – ప్రాణరక్షణకు మొదటి అడుగు కార్యక్రమం. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ అవగాహన ర్యాలీ నందు విశ్వం ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.రెండు చక్రాల వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో అధిక శాతం తల గాయాల వల్లనే జరుగుతున్నాయి. సరైన ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయమైన గాయాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ కార్యక్రమంలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మిస్టర్ అర్షద్ అలీ పిలుపుమేరకు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.హెల్మెట్ కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అది మన జీవిత భద్రతకు సంబంధించిన బాధ్యత. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలపై పడే దెబ్బ తీవ్రత తగ్గి, ప్రాణనష్టం నివారించవచ్చు. ప్రత్యేకంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. డ్రైవర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అందుకే ప్రతి ఒక్కరూ “హెల్మెట్ – నా భద్రత, నా బాధ్యత” అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి, సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి. హెల్మెట్ ధరించండి – మీ కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించండి.
Reporter
Namitha News