Monday, 27 July 2026 01:19:51 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు

ఇంచార్జ్డి జాయింట్ కలెక్టర్, డి .ఆర్.ఓ. మధుసూదన్ రావ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 18 March 2026 02:52 PM Views : 292

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన ఐదేళ్ల పదవీకాలం 2021 మార్చి 18 నుండి 2026 మార్చి 17 సాయంకాలం వరకు కొనసాగి, నిర్ణీత గడువు నాటికి పూర్తయినది.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన దృష్ట్యా, పరిపాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో పరిపాలన బాధ్యతలను తాత్కాలికంగా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహించనున్నది. ఈ క్రమంలో మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు నియమితులయ్యారు. బుధవారం ఉదయం మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు

ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే నగర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు

ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ కు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :