నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ స్థానాలలో రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని రాష్ట్ర కాపునాడు సంఘ ఉపాధ్యక్షుడు అంజన్ కుమార్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తంబళ్లపల్లెలో జరిగిన బలిజల ఆత్మీయ6 సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 33% పైగా బలిజ సామాజిక వర్గం బలంగా ఉండి అందుకు తగ్గట్టు రాజకీయంగా అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర తో పాటు రాయలసీమలో పలు నియోజకవర్గాలలో ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశామని నేడు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి దశా దిశా బలిజ సామాజిక వర్గానికి నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. అలాంటి బలిజలకు రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఈ విషయమై రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం ఒక్క తాటిపై నిలిచి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రాయలసీమ లో బలిజ సామాజిక వర్గం దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి తగిన న్యాయం జరగలేదని ఇప్పటికైనా కచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, బిజెపి మాధవ్, నారా లోకేష్ లను కోరుతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో బలిజ సామాజిక వర్గం ఐక్యతతో పాటు బలోపేతానికి ఈ నెల 26వ తేదీ బి కొత్తకోటలో జరిగే బలిజ ఆత్మీయ సమావేశానికి ప్రతి బలిజ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేకే కృష్ణమూర్తి, కాకర్ల కృష్ణమూర్తి, కసెట్టి వెంకటరమణ ,కుంచు మోహన్, కొటాల శివకుమార్, ధనుంజయ, జగదీష్, మోపూరి రెడ్డప్ప, రామచంద్ర, మధుసూదన్, మల్లికార్జున లు పాల్గొన్నారు
Reporter
Namitha News