నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పురాతన కోనేరు పుష్కరిణిల అభివృద్ధిలో భాగంగా తంబళ్లపల్లె నడిబొడ్డున గల పురాతన కోనేరు ఎంపికై అభివృద్ధి పనులు చేపట్టడం హర్షనీయమని ఎంపీడీవో ఉషారాణి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అభివృద్ధి పనులకు ఎంపీడీవో తో పాటు మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మలు పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.టిఎన్ కుటుంబీకుల హయాంలో ఓ వెలుగు వెలిగిన కోనేరు సుమారు 7 లక్షల ఉపాధి నిధులతో కోనేరు లో ముండ్ల చెట్ల తొలగింపు, ప్రహరీ గోడ నిర్మాణం తోపాటు గేట్లు, లోపల మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప తెలిపారు. కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పరుగులు పెడుతున్నాయని కోనేరును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ వెంకటరమణ, టెక్నికల్ అసిస్టెంట్ బాలగంగాధర్,కార్యదర్శి శ్రీనివాసరావు,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, కాలా నారాయణ, రామచంద్రారెడ్డి, సుధాకర్, కన్నె మడుగు సురేంద్ర, గోపి దీన్ని సుధాకర్, శ్రీనివాసులు,జనసేన ఎద్దుల నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News