నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 16 : తంబళ్లపల్లె మండలంలో మంగళవారం మధ్యాహ్నం ట్రాక్టర్ డీ కొట్టి బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దమం మండలం ముసలికుంటకు చెందిన దేవేంద్ర కొడుకు 14సంవత్సరాల ఎం. రాము బైక్ లో తంబళ్లపల్లికి వస్తుండగా, మార్గమధ్యంలోని గోపిదిన్నె సమీపం లో చెవిటివానిపల్లి వద్ద గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టి అక్కడికక్కడే రాము మృతి చెందాడు. యస్.ఐ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Reporter
Namitha News