నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలోని చెత్త డంపింగ్ యార్డ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం తంబళ్లపల్లె కార్యదర్శి శ్రీనివాస్ రావు తంబళ్లపల్లె కు చెందిన చెత్తను పరుసతోపు వద్ద ప్రభుత్వ భూమిలో చెత్త డంపింగ్ చేయడానికి కొందరు అడ్డుపడుతున్నారని పంచాయతీ సిబ్బందితో తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన తాసిల్దార్ చెత్తడంపింగ్ కు ఎవరు అడ్డుపడ రాదని అలా అడ్డుపడితే చర్యలు చేపట్టాలని వీఆర్వో నాగరాజుకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన 2027లో భాగంగా స్వీయ నమోదు అందుబాటులోకి వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 16 నుండి 30 వరకు 15 రోజులు పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వీయ జనగణన కార్యక్రమం ద్వారా కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని ఈ అవగాహన కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి సహకరించాలన్నారు. ఆయన వెంట వీఆర్వో నాగరాజు, పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News