నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 06 ః మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ దళితవాడలో మొలకల పౌర్ణమి పండుగ వేడుకగా చేసుకున్నారు. సందర్భంగా గ్రామంలోని మహిళలు నవధాన్యాలతో బోనం వండి బోనాలుఊరేగింపుగా గ్రామదేవతల కు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి సంవృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి పాడి పశువుల అభివృద్ధి చెందాలని గ్రామదేవతలకు మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం నవధాన్యాలతో వేసిన మొలకను అమ్మవార్ల ముందు ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు
Reporter
Namitha News