నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 24 : నేడు హిందూ సమాజం గడప లోపల కులం గడప బయట మనందరం హిందువులమని సగర్వంగా చాటి చెప్పాలని తిరుపతి విభాగ ప్రచార మల్లికార్జున ప్రబోధించారు. శనివారం మండల కేంద్రం పాత జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు, హిందూ బంధువులు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మో5 రక్షితి రక్షిత సిద్ధాంతాన్ని ప్రతి హిందువు పాటించాలని సూచించారు. 1925లో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ కేశవరాం బలిదాం హెగ్డే వాల్ ఆర్ఎస్ఎస్ స్థాపించారని నాటి నుండి హిందూ మత సంస్కృతి సాంప్రదాయాలను స్మరిస్తూ మన సంస్కృతిని కాపాడడానికి కృషి చేసినట్లు చెప్పారు. ప్రతి హిందువు విదేశీ సంస్కృతిని విడనాడి స్వదేశీ సంస్కృతి అవలంబించాలని సూచించారు. నేటి హిందూ సమాజం మేలుకొని మన సంస్కృతి కాపాడి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం సభలోని ఆర్ఎస్ఎస్, బిజెపి, హిందూ బంధువులు భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెంకటరమణ, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, యుగంధర్, సుబ్బయ్య, హరినాథ్ రెడ్డి, రాఘవరెడ్డి,ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News