Sunday, 26 July 2026 09:54:47 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గడప లోపల కులం... గడప బయట హిందువులం... తిరుపతి విభాగ ప్రచారక్ మల్లికార్జున

Date : 24 January 2026 09:53 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 24 : నేడు హిందూ సమాజం గడప లోపల కులం గడప బయట మనందరం హిందువులమని సగర్వంగా చాటి చెప్పాలని తిరుపతి విభాగ ప్రచార మల్లికార్జున ప్రబోధించారు. శనివారం మండల కేంద్రం పాత జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు, హిందూ బంధువులు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మో5 రక్షితి రక్షిత సిద్ధాంతాన్ని ప్రతి హిందువు పాటించాలని సూచించారు. 1925లో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ కేశవరాం బలిదాం హెగ్డే వాల్ ఆర్ఎస్ఎస్ స్థాపించారని నాటి నుండి హిందూ మత సంస్కృతి సాంప్రదాయాలను స్మరిస్తూ మన సంస్కృతిని కాపాడడానికి కృషి చేసినట్లు చెప్పారు. ప్రతి హిందువు విదేశీ సంస్కృతిని విడనాడి స్వదేశీ సంస్కృతి అవలంబించాలని సూచించారు. నేటి హిందూ సమాజం మేలుకొని మన సంస్కృతి కాపాడి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం సభలోని ఆర్ఎస్ఎస్, బిజెపి, హిందూ బంధువులు భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెంకటరమణ, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, యుగంధర్, సుబ్బయ్య, హరినాథ్ రెడ్డి, రాఘవరెడ్డి,ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :